లేపాక్షి ఆలయంలో బాలకృష్ణ శివరాత్రి ప్రత్యేక పూజలు..!

మహాశివరాత్రి రోజున హిందువులు శివుడిని భక్తితో కొలుస్తారు. గురువారం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామున నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

ఈక్రమంలో టాలీవుడ్ నటుడు, హిందూరపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శివరాత్రి సందర్భంగా లేపాక్షిలోని దుర్గా పాపనాశేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ దంపతులు ఉదయం ఆలయానికి చేరుకుని మూలవిరాట్టును దర్శించుకున్నారు. శివుడికి అభిషేకం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన హిందూపురంలోనే ఉండటంతో శివరాత్రి వేడుకలను అక్కడే జరుపుకుంటున్నారు.  

Leave a Comment