‘డూ ఆర్ డై’ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ శ్రమించింది. బౌలింగ్ మరియు బ్యాటింగ్ తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
అయితే కష్ట సాధ్యం కానీ లక్ష్యమే అయినా హైదరాబాద్ తడబడింది. రాజస్థాన్ బౌలర్ ఆర్చర్ వరుస ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ ఔట్ చేశాడు. దీంతో హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. కాగా మనీష్ పాండే, విజయ్ శంకర్ ఇద్దరు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన హైదరాబాద్ గెలిచింది.
కాగా, మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ లో సెటైర్లు వేసింది. ఈనెల 11న హైదరాబాద్ పై గెలవగానే..‘జొమాటోలో మే ఓ లార్జ్ హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాం’ అని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. అలాగే రియాన్ పరాగ్ డాన్స్ చేయడం సన్ రైజర్స్ అభిమానులకు నచ్చలేదు. గురువారం రాజస్థాన్ పై గెలవగానే సన్ రైజర్స్ మరో ట్వీట్ చేసింది. ‘మిత్రులారా.. బిర్యానీ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి.. ఈ ఘాటును మీరు తట్టుకోలేరు. మీకు పొంగనాలు, పప్పు చాలా’ అని సెటైర్ వేసింది.
Cancel the biryani order our friends can’t handle the level of spice 🙂
P.S. : Daal baati should just do fine.#RRvSRH #KeepRising #OrangeArmy #Dream11IPL https://t.co/CLvZ1VhJkN
— SunRisers Hyderabad (@SunRisers) October 22, 2020