ఆస్ట్రేలియాలో బుమ్రా, సిరాజ్ పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొంత మంది ఆస్ట్రేలియా అభిమానులు సిరాజ్, బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

వాళ్లిద్దరిపై ఆస్ట్రేలియా అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్ అజింక్యా రహానే, జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రోహిత్ శర్మలతో కలిసి ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో భారత ఆటగాళ్లను సెక్యూరిటీ మధ్య డ్రెస్సింగ్ రూంకు పంపించారు. బౌలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సిడ్నీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 

Leave a Comment