‘ఆ రేపిస్టులు బ్రాహ్మణులు.. వారు సంస్కారవంతులు’ : బీజేపీ ఎమ్మెల్యే

బిల్కిస్ బానో అత్యాచర కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఈక్రమంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రేపిస్టులకు మద్దతుగా మాట్లాడారు.. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, వారు సంస్కారవంతులను గోద్రా ఎమ్మెల్యే సి.కె.రౌల్ జీ వ్యాఖ్యానించారు. 

వారు నేరంచేశారో లేదో తనకు తెలీదని, అయితే నేరం చేయాలన్న ఉద్దేశం ఉండాలని అన్నారు. వారిలో కొంత మంది బ్రాహ్మణులు ఉన్నారని, బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులని తెలిపారు. వారిని శిక్షించాలని కొందరు దురుద్దేశం అయి ఉండొచ్చని, జైలులో ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దోషులకు శిక్ష తగ్గించాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలో రౌల్ జీ ఒకరు.

రాహుల్ గాంధీ విమర్శ:

దోషులను విడుదల చేయడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఉన్నావ్ – బీజేపీ ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నం, కథువా – రేపిష్టులకు మద్దుతుగా ర్యాలీ, హత్రాస్ – అత్యాచార నిందితుల పక్షాన ప్రభుత్వం, గుజరాత్ – అత్యాచార దోషుల విడుదల, సన్మానం. నేరస్థులక మద్దతు ఇవ్వడం మహిళల పట్ల బీజేపీ మనస్తత్వం ఏమిటో ఈ చర్య ప్రతిబింబిస్తోంది. ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా మోడీజీ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.   

 

Leave a Comment