‘ఛోటు నువ్వు బ్యాట్ బాల్ ఆడుకో’.. రిషభ్ పంత్ కు బాలీవుడ్ నటి కౌంటర్..!

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కి బాలీవుడ్ నటీ ఊర్వశీ రౌతెలాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. రిషభ్ పంత్ తనపై చేసిన పోస్ట్ పై ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని ఓ హోటల్ లో రిషభ్ పంత్ తనను కలవడం కోసం ట్రై చేశాడని, అయితే తాను గదిలోకి వెళ్లి నిద్రపోయానని ఊర్వశీ రౌతెలా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు 17 మిస్డ్ కాల్స్ కూడా చేశాడని,  తర్వాత కలుద్దామని చెప్పానని తెలిపింది. ఆ తర్వాత ముంబాయిలో రిషభ్ పంత్ ని కలిశానని చెప్పుకొచ్చింది.. 

దీనిపై రిషభ్ స్పందిస్తూ.. కొందరు కేవలం పాపులారిటీ కోసమే ఇంటర్వ్యూల్లో అలా మాట్లాడుతారని తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. వాళ్లు ఫేమస్ అయ్యేందుకు ఇలా అబద్ధాలు ఆడటం బాధాకరమని చెప్పాడు. అయితే ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేశాడు.. అయితే అది అప్పటికే వైరల్ అయ్యింది. దీనిపై ఊర్వశీ ఘాటుగా స్పందించింది. ‘ఛోటు భయ్యా నువ్వు బ్యాట్ బాల్ ఆడుకో.. నేనేం చిన్న పిల్లని కాదు బాద్నాం చేయడానికి’ అంటూ కౌంటర్ ఇచ్చింది.. 

Leave a Comment