దుబ్బాకలో బీజేపీ విజయం..!

తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. హోరా హోరీగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. దీంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ఓటమి తప్పలేదు. 1,118 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. 

మొదటి పది రౌండ్లలో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చింది. అయితే మధ్యలో టీఆర్ఎస్ పుంజుకుంది. 11 నుంచి 20 రౌండ్ల వరకు లీడింగ్ లోకి వచ్చింది. కానీ 20వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది. 20,21,22,23 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రావడంతో సంచలన విజయం నమోదు చేసింది.   

దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 62,773 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితమయ్యారు. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంన్నాయి. 

Leave a Comment