గోమూత్రం తాగండి.. కరోనాను అరికట్టండి : బీజేపీ ఎమ్మెల్యే

కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతో పాటు, లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. అయితే కరోనాను నిలువరించడానికి గోమూత్రం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని, దానిని ప్రతి రోజూ తాగాలని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు…

ప్రతిరోజూ గోమూత్రం తాగడం వల్ల కరోనాను నిలువరించవచ్చని ఉత్తరప్రదేశ్ లోని బైరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని, తాను రోజులో 18 గంటలు పనిచేయడానికి అదే కారణమని వెల్లడించారు. రెండు లేదా మూడు మూతల గోమూత్రాన్ని ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలని తెలిపారు. 

ఆవు పంచకం తీసుకున్న అరగంట వరకు ఎలాంటి పదార్థాలు తినడం కానీ తాగడం కానీ చయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల కేవలం కరోనాను మాత్రమే కాకుండా అనేక రోగాలను నయం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. సైన్స్ నమ్మినా నమ్మకపోయినా.. ఆవు పంచకంపై మాత్రం అపారమైన విశ్వాసం ఉందని తెలిపారు. 

Leave a Comment