భార్య విలాసాలను తీర్చలేక..పాపం పెళ్లయిన నాలుగు నెలలకే ఆత్మహత్య..!

పెళ్లయిన కొత్తలో కొత్త దంపతులు సినిమాలు, షికార్లు చేయడం మామూలే.. అయితే వారానికో లేదానెలకోసారి జరిగితే ఫర్వాలేదు. రోజు చేయాలంటే భర్తకు నరకమే..భర్త ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా భార్య గొంతెమ్మ కోర్కెలు కోరితే మాత్రం ఆ భర్తకు ఇబ్బందులు తప్పవు. అలా ఓ భార్య గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఓ భర్త పెళ్లయిన నాలుగు నెలలకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

వివరాల మేరకు బసవేశ్వరనగర్ లోని మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన బాషా(31).. ఉస్నా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. బాషా మెకానిక్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.. బాషా తన భార్యను బాగానే చూసుకుంటున్నాడు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ బాషాకు తలనొప్పులు మొదలయ్యాయి. 

ప్రతిరోజూ బయటకు వెళ్లాలని ఒత్తిడి చేసేది. వెళ్లిన ప్రతిసారీ బట్టలు, నగలు కొనివ్వాలని పదేపదే కోరేది. కొత్తలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. బాషా ఆమె అడిగినవి కొనిచ్చాడు. కానీ ఆమె కోర్కెలు తీర్చడం బాషాకు కష్టంగా మారింది. దీంతో ఈ విషయంలో భార్యాభర్తలకు రోజూ గొడవ జరిగేది.. 

మెకానిక్ గా పనిచేసుకుంటున్న తనకు అంత జీతం రాదని భార్యను నచ్చజెప్పేందుక ప్రయత్నించాడు. కాని ఉస్నా మాత్రం భార్య కోర్కెలను తీర్చలేనివాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటూ దెప్పిపొడిచేది. ఇలా రోజూ వీరి మధ్య గొడవలు జరుగుతుండంతో బాషా భార్య మాటలకు మనస్తాపానికి గురయ్యాడు. మానసిక ఒత్తిడితో బాషా సోమవారం రాత్రి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.         

Leave a Comment