ఏపీ సీఎం జగన్ కు బండి సంజయ్ వార్నింగ్..!

సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు. 

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. 

వైసీపీ ప్రభుత్వం మూటా ముల్లె సర్దుకునేలా తరమికొడతామని సంజయ్ అన్నారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. హిందువుల కానుకలను ఏపీ ప్రభుత్వం దారి మళ్లీస్తోందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యక్తలు బలవంతులని, సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Leave a Comment