కరోనాను జయించేందుకు మంత్రం చెప్పిన బాలయ్య..!

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? మంత్రాలకు కరోనాను జయించవచ్చా? అంటే అవునంటున్నారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ..ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు అహర్నిషలు శ్రమిస్తోంది. అయితే ఒకేఒక మంత్రంతో కరోనాను జయించవచ్చని బాలక్రిష్ణ అంటున్నారు. లలితా త్రిపుర సుందరీ మంత్రాన్ని ఆయన చదివి వినిపించారు.  కరోనా పోవాలంటే నారాయణ మంత్రం చదవాలని చెప్పారు. ఆయన చదవడమే కాకుండా అంతా పాటించాలని సూచించారు. 

కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు బాలక్రిష్ణ ఓ మంత్రం చెప్పారు. తాను చెప్పిన మంత్రాన్ని రోజూ చదివితే కరోనాను నివారించవచ్చని తెలిపారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాలయ్యపై జోకులు పేలుస్తున్నారు. కాగా, హిందూపురం ఆస్పత్రికి రూ.55 లక్షల విలువైన కరోనా వైద్య పరికరాలు, మందులను బాలక్రిష్ణ అందజేశారు. 

Leave a Comment