కర్నూలులో అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్..!

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన తన అభిమానితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా వారం రోజులుగా కర్నూలులోనే ఉంటున్నారు. 

కర్నూలుకు చెందిన ఓ వీరాభిమానిని బాలకృష్ణ బాగా గుర్తుపెట్టుకున్నారు.. ఆదోని బాలకృష్ణ  అభిమాన సంఘం అధ్యక్షులైన ఎన్.సజ్జాద్ హుస్సెన్ కి ఆయనే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకున్నారు. తన కుటుంబంతో సహా రావాల్సిందిగా చెప్పారు. తన దగ్గరకు వచ్చిన అభిమాని కుటుంబంతో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. దీంతో అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది బాలయ్య తమకు ఇచ్చిన గొప్ప కానుక అని, జీవితంలో ఈ గిఫ్ మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.

 

Leave a Comment