30 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకొని.. 85 ఏటా చనిపోయాడు..!

ఓ వ్యక్తి 30 ఏళ్ల క్రితం తన సమాధిని నిర్మించుకున్నాడు. 85వ ఏటా ఆ వ్యక్తి చనిపోవడంతో ఆ సమాధిలోనే అంత్యక్రియలు నిర్వహించారు.. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ తాలూకాలోని నంజేదేవన్ పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది.. 

వివరాల మేరకు.. నంజేదేవన్ పూర్ కి చెందిన పుట్టనంజప్ప(85) 30 ఏళ్ల క్రితం శ్మశాన వాటికలో తన సమాధిని తానే స్వయంగా నిర్మించుకున్నాడు. సిమెంటు, ఇటుకలతో తనకు నచ్చిన రీతిలో నిర్మాణం చేసుకున్నాడు. తాను చనిపోతే అందులోనే అంత్యక్రియలు చేయాలని తన కుటుంబ సభ్యులకు సూచించాడు.. 

ఇటీవల పుట్టనంజప్ప తన 85వ ఏటా సహజ మరణం పొందారు.. ఆయన కోరిక మేరకు  కుటుంబ సభ్యులు ఆ సమాధిలోనే అంత్యక్రియలు చేశారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలకు కష్టపడకూడదని తన అంత్యక్రియలకు, తిథి పనులకు రూ.లక్ష నగదు ముందుగానే దాచి పెట్టుకున్నాడు. అంతేకాదు.. అంత్యక్రియలకు అవసరమైన పూజా సామగ్రిని సైతం తానే కొని పెట్టుకున్నాడు.. 

 

Leave a Comment