ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమా సన్నివేశాలను రిలీజ్ చేస్తున్న బాలకృష్ణ..!

దివంగత ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా. ఈ సినిమాను బాలకృష్ణ తిరిగి నిర్మించాలనుకున్నారు. కొన్నేళ్ల క్రితం షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్తంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. లక్ష్మీపతి నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబూ  నటించారు. 

కాగా, ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోకుండానే ఆగిపోయింది. సౌందర్య హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ‘నర్తనశల’ షూటింగ్ ఆపేశారు. అయితే ఆగిపోయిన నర్తనశాలలోని 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఇప్పుడు విడుదల చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. విజయదశమి కానుకగా ఈనెల 24న ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. 

 

నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు…

Posted by Nandamuri Balakrishna on Monday, October 19, 2020

Leave a Comment