షహీన్ బాగ్ షూటర్ కు బెయిల్..

దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన నిరసనలతో ప్రారంభమై హింసాత్మక రూపాన్ని దాల్చాయి. ఈ షహీన్ బాగ్ ప్రాంతంలో గత ఫిబ్రవరి 1న కపిల్ బైసలా అనే గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా శనివారం ఢిల్లీ కోర్డు కపిల్ బైసలాకు బెయిల్ మంజూరు చేసింది. 

ఈస్ట్ ఢిల్లీ దల్లుపుర ప్రాంతానికి చెందిన కపిల్ బైసలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ..ఆందోళనలు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు ఫిబ్రవరి 1న గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా..పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో వెంటనే పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టుకు హాజరుపర్చడంతో అతడిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. అయితే విచారణలో కపిల్ తనకు వ్యక్తిగతంలో జరిగిన ఇబ్బందుల ద్వారానే అలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. తన కుటుంబానికి చెందిన వారిది త్వరలో పెళ్లి ఉందని, ఈ మార్గంలో వెళ్లాలంటే నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కనీసం షాపింగ్ చేయాలన్న కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు..ఈ ఆందోళనకారుల తీరువల్లే తరచూ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయేవాడినని, ఇలా ప్రతి రోజూ ట్రాఫిక్ జామ్ అవుతుండటం తనకు తీవ్ర ఆగ్రహం కల్గిందని పేర్కొన్నాడు. అయితే చట్ట ప్రకారం పోలీసులు కపిల్ పై కేసు నమోదు చేశారు. 

Leave a Comment