ప్రముఖ నటుడు విజయ సేతుపతిపై దాడి జరిగింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం రాత్రి జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. అయినా ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే దుండగుడిని పట్టుకున్నారు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తిని విజ్ సేతుపతి ఏమీ అనకుండా సైలెంట్ గా వెళ్లిపోయారు. ఈ దాడి జరిగింది బెంగళూరు కావడంతో ఇది ప్రాంతీయ దురభిమానల పనే అయి ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతిపై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఎన్నో ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. రెండు రాష్ట్రాల నటులు ఎంతటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే..ఇటీవల పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదరవుతాయనే ఉద్దేశంతో తమిళ హీరోలు హాజరు కాలేదు. ఈక్రమంలో బెంగళూరులో విజయ్ సేతుపతిపై దాడి కలకలం రేపింది.
Actor #VijaySethupathi attacked in Bengaluru Airport. pic.twitter.com/lyJkeraFTO
— Manobala Vijayabalan (@ManobalaV) November 3, 2021