ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గత మూడు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేజ్రీవాల్ కు కరోనా సోకలేదని తేలింది. 

సీఎం కేజ్రీవాల్ ఆదివారం నుంచి అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది. పరీక్షలు నెగెటివ్ గా రావడంతో అధికార యంత్రాంగం, కేజ్రీవాల్ కుటుంబం ఊపిరిపీల్చుకుంది. 

 

Leave a Comment