చలి చంపేసింది.. మంచు కొండల్లో జవాన్ మృతి..!

చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు అనే ఆర్మీ జవాన్ కన్నూమూశాడు. జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 సంవత్సరాలుగా ఆర్మీలో జవాన్ గా పనిచేస్తున్నాడు. 

జమ్మూకశ్మీర్ లో శనివారం చలి తీవ్ర అధికంగా ఉండటంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు సహచరులు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో తుది శ్వాస విడాచాడు. సంక్రాంతికి సెలవుపై వస్తానన్న రెడ్డప్ప విగతజీవిగా వస్తుండడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  

 

Leave a Comment