బిడ్డతో సహా ఓ డాక్టర్ ఆత్మహత్య..!

అందరికీ ప్రాణాలు పోసే డాక్టర్ చివరికి తన ప్రాణాలు తీసుకుంది. కొడుకుతో సహా బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో కొడుకుతో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రి దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆస్పత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్ డి.లావణ్య(33) చర్మ వ్యాధి నిపుణురాలిగా పనిచేస్తుంది. 

ఆమెకు కొన్నెేళ్ల కింద వరంగల్ కు చెందిన డాక్టర్ వంశీక్రిష్ణతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి లావణ్యకు భర్తతో విభేదాలు రావడంతో రెండు నెలల కింద ఆమె పుట్టింటికి వచ్చింది. ఈనేపథ్యంలో లావణ్యకు భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. 

అప్పటి నుంచి లావణ్య మనస్తాపంతో ఉంది. శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్(7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..అక్కడ చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. చివరికి వారు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment