సెలవుల్లో ఇంటికొస్తూ జవాన్ మృతి.. గర్భిణీ అయిన భార్య ఆత్మహత్యాయత్నం..!

సెలవుపై ఇంటికి వస్తున్న జవాన్ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేక గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు పేటకు చెందిన మనోహర్(29) పదేళ్ల కింద ఆర్మీలో చేరారు. మనోహర్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారు. సెలవుపై శుక్రవారం ఇంటికి బయలుదేరాడు. 

ఈక్రమంలో మధ్యప్రదేశ్ లోని ఓ స్టేషన్ లో రైలు దిగాడు. తిరిగి రైలు ఎక్కే సమయంలో కాలుజారీ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మనోహర్ భార్య రమాదేవి ప్రస్తుతం నిండు గర్భిణీ.. భర్త మృతి వార్తను భార్య రమాదేవి జీర్ణించుకోలేకపోయింది. ఆమె స్వగ్రామం నందవరం మండలం గురజాలలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు.  

Leave a Comment