15 ఏళ్లకే కూలేందుకు సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్.. డైలమాలో ప్లాట్ యజమానులు.. !

లక్షల రూపాయలు పోసి అపార్ట్మెంట్ లో ప్లాట్ తీసుకున్నారు. నిర్మించిన 15 ఏళ్లకే ఆ అపార్ట్మెంట్ కూలేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డారు అపార్ట్మెంట్ వాసులు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 2004లో ఓ అపార్ట్మెంట్ నిర్మించారు. ఈ అపార్ట్మెంట్ లో ప్రస్తుతం 20 కుటుంబాల వరకూ నివాసం ఉంటున్నాయి. 

అయితే రెండు రోజుల క్రితం అపార్ట్మెంట్ లో పిల్లర్లు విరిగి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు రోడ్డుపైకి పరుగులు తీశారు.  పిల్లర్స్ క్రాక్ రావడంతో అపార్ట్మెంట్ వాసులు జాకీలతో సపోర్టు ఇచ్చారు.  

ఇక విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్ కు నోటీసులు ఇచ్చి.. అందులో ఉండేవారిని ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యత లోపం వల్ల అపార్ట్మెంట్ ఎక్కడిక్కడ బీటలు తీసింది. దీనికి మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో అందులో ఉన్న వారికి ఖాళీ చేయించడం ఒక్కటే మార్గంలా కనిపిస్తోంది. దీంతో ప్లాట్ యజమానులు అద్దె ఇల్లును వెతుక్కుంటున్నారు.  

Leave a Comment