కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ సమర్థవంతంగా పని చేస్తోంది..

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

ఏపీ నుంచి ఒడిశా వలస కూలీలు, కార్మికులు చిక్కుకుపోయిన వారి తరలింపుపై సీఎం జగన్ ఒడిశా సీఎం సవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఏపీ వాళ్లని కూడా తరలించే విషయమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం మాట్లాడుతూ ‘‘ఏపలో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్‌ వల్ల ఎదురవుతున్న క్లిష్ట పరిస్ధితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోంది.’’ అనంతరం సీఎం జగన్ కు దన్యవాదాలు తెలిపారు. 

వారి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం – సీఎం జగన్

‘‘మీ అభ్యర్ధనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో రిలీఫ్‌ క్యాంప్‌లలో ఉన్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్ళేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం.’’అని సీఎం జగన్ తెలిపారు. 

 

Leave a Comment