సుశాంత్ అంత్యక్రియల సమయంలో మరో విషాదం..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..ఈ విషయం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ సింగ్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరిగాయి. అతికొద్ది మంది సమక్షంలో మాత్రమే సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. 

కాగా సుశాంత్ అంత్యక్రియలు జరుగుతుండగా అతడి ఇంట మరో విషాదం జరిగింది. సుశాంత్  మృతిని తట్టుకోలేక అతడి వదిన (కసిన్ బ్రదర్ భార్య) సోమవారం మరణించారు. ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదం బీహార్ లోని పూర్ణియాలో చోటుచేసుకుంది. సుశాంత్ మృతిని తట్టుకోలేక ఆహారం కూడా తీసుకోవడం మానేసినట్లు సమాచారం. ఒకవైపు సుశాంత్ సింగ్ అంత్యక్రియలు జరుగుతుండట, మరో వైపు సుశాంత్ వదిన మరణించడంతో వారి కుటుంబంలో మరో విషాదం నెలకొంది. 

 

Leave a Comment