నాయుడూ వాటే కలర్ సెన్స్..

ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మరియు లోకేస్ బాబులపై వ్యంగ్యస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారిపై మరో సారి సెటైర్ వేశారు. ‘నల్లధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్ సెన్స్’ అంటూ విమర్శించారు. టీడీపీ నేతలపై ఏసీబీ దాడులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. దీనిపై విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. 

నారాలోకేస్ పై కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ‘లోకేష్ ను మాలోకం అనేది అందుకే. జేసీ తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిటట్డానికి వెళ్లాడా? వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది. తనను తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా’ అంటూ లోకేష్ పై సెటైర్లు సంధించారు. 

Leave a Comment