యూపీలో హత్రాస్ తరహాలో మరో గ్యాంగ్ రేప్.. దళిత యువతి మృతి!

యూపీలోని హత్రాస్ లో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరువకముందే మరో మూడు ఘోరాలు వెలుగు చూశాయి. హత్రాస్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలరాంపూర్ లో ఓ దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం హతమార్చిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. యూపీలోని బలంపూర్ కుచెందిన 22 ఏళ్ల యువతి కాలేజీ అడ్మిషన్ కోసం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయల్దేరింది. 

సాయంత్రం ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు ఆమెను అడ్డుకుని మత్తు మందు ఇచ్చారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం 7 గంటల సమయం ఆమె నడవలేని స్థితిలో, చేతికి సెలైన్ బాటిల్ తో ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుండగులు ఆమె నడుమును విరచడంతో పాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని వెల్లడైంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశార..

14 ఏళ్ల బాలికపై రేప్..

యూపీలోని బులందర్ లో ఓ 14 ఏళ్ల బాలికపై పక్కింటి యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎనిమిదేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం..

యూపీలోని అజాంఘర్ జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువకుడు రేప్ చేశాడు.. చిన్నారికి స్నానం చేయిస్తానని ఆమె తల్లికి మాయమాటలు చెప్పి తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు.. ఆ తర్వాత చిన్నారిని రేప్ చేశాడు..దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. బాధితురాలి తల్లి తన బిడ్డను ఆస్పత్రికి తరలించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు..

Leave a Comment