వాలంటీర్ ఆత్మహత్య.. సీఎం జగన్ కారణమంటూ లెటర్..!

అనంతపురం జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాయదుర్గం పట్టణంలోని నాలుగో సచివాలయం 9వ వార్డులో వాలంటీర్ గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం మహేష్ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘నా చావుకు కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు వాలంటీర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని, వాలంటీర్లు మూడు పూటల అన్నం తినగలుగుతున్నారా? అంటూ లేఖలో ప్రశ్నించాడు. నా లాంటి పరిస్థితి మరొక వాలంటీర్ కు రాకుండా సీఎం జగన్ చూడాలని లేఖలో వేడుకున్నాడు. 

Leave a Comment