వైరల్ అవుతున్న 1947 నాటి పోస్టల్ స్టాంప్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్టల్ స్టాంప్ వైరల్ అవుతోంది. రేపు భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పోస్టల్ స్టాంప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా ఈ పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఈ స్టాంపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ స్టాంపు మీద భారతదేశ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. దీనిపై ఆగస్టు 15, 1947 మరియు హిందీలో జై హింద్ అని రాసి ఉంది.  

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో మహోత్సవం జరుపుతున్నారు. కేంద్ర మంత్రి వైష్ణవ్ షేర్ చేసిన ఈ స్టాంపు ధర 3.50 అణాలు. దీంతో పాటు ఆయన 1980లో విడుదలైన రెండు స్టాంపులను షేర్ చేశారు. మహాత్మగాంధీ దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహాల స్టాంపులను పంచుకున్నారు. 

 

Leave a Comment