తన ఆరోగ్యంపై అమిత్ షా క్లారిటీ..

ఇటీవల అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తు ఒక ట్విట్ చేశారు. ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ వ్యాధితో బాధపడటం లేదు అని స్పష్టం చేశారు. 

‘దేశం ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారితో పోరడుతుంది. నేను నా విధులు నిర్వర్తించడంలో బిజీగా ఉన్నాను. కావును ఈ పుకార్లపై దృష్టి పెట్టలేదు. గత రెండు రోజులుగా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఈ రోజు నా ఆరోగ్యంపై స్పష్టత ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

తన ఆరోగ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు రావడం తనకు మరింత బలోపేత చేస్తాయని అన్నారు. అలాంటి చర్చలు చేయడం మానేయాలని, తనకు తన పని చేయనివ్వాలని అమిత్ షా అభ్యర్థఇంచారు. ఎవరి పని వారు చేసుకోవాలని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు బీజేపీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలపారు. అయితే ఈ పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని ట్వట్ లో పేర్కొన్నారు. 

Leave a Comment