యోగి సర్కార్ కీలక నిర్ణయం.. గోవులకు అంబులెన్స్ సర్వీస్..!

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆవుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించాలని నిర్ణయించింది. తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న గోవుల కోసం 515 అంబులెన్స్ లను త్వరలో ప్రారంభించనున్నారు. దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది..

నవల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 515 అంబులెన్స్ లు ఆవులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు యూపీ పశుసంవర్థక శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్ లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. అంబులెన్స్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గోవులకు  అంబులెన్స్ సర్వీస్ కోసం 112  నెంబర్ కు కాల్ చేయాలన్నారు. డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని లక్ష్మీ నారాయణ్ వెల్లడించారు.   

Leave a Comment