కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం..!

కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కేరళలో శనివరం రాత్రి జరిగింది. వివరాల మేరకు కేరళలోని తిరువనంతపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠనమిట్ట ప్రాంతంలో 19 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ సెంటర్ కు తరలించేందుకు ఆమె బంధువులు అంబులెన్స్ ను పిలిపించారు. ఆ యువతిని తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ వచ్చింది. ఆ వాహనానికి డ్రైవర్ గా నౌఫాల్(25) వచ్చాడు. 

ఆ వాహనంలో ఇద్దరు కోవిడ్ రోగులను ఐసోలేషన్ తరలించేందుకు వాహనం ఎక్కించుకున్నాడు. వారిలో ఒక వృద్దురాలు ఉంది. ఆ వృద్దురాలిని వేరే ఆస్పత్రిలో వదిలి అక్కడి నుంచి యువతిని తీసుకొని పండాలమ్ ఆస్పత్రికి బయలుదేరాడు. నిర్మానూష్య ప్రాంతానికి తీసెకెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అర్ధరాత్రి కోవిడ్-19 సెంటర్ వద్ద వదిలేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు ఆ డ్రైవర్ ను అరెస్టు చేశారు. 

Leave a Comment