తహసీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ సందడి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా అల్లు అర్జున్ ఎంతగొప్ప పేరు ఉన్నా.. వ్యక్తిగతంగా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఈమధ్య కాకినాడలో చిన్న హోటల్ కి వెళ్లి టిఫిన్ చేశాడు అల్లు అర్జున్.. 

తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యారు. శంకర్ పల్లి మండలంలోని జన్వాడలో అల్లు అర్జున్ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్ కార్యాయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయిన తర్వాత ప్రొసీడిండ్ ఆర్డర్ ను శంకర్ పల్లి తహసీల్దార్ సైదులు అల్లు అర్జున్ కి అందజేశారు. 

తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తహసీల్దార్ కార్యాయల సిబ్బంది, అభిమానులు ఆయనతో సెల్పీలు తీసుకన్నారు. ఇక రిజిస్ట్రేషన్ పనులు పూర్తయిన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు…  

Leave a Comment