జంతువుల కళేబరాలతో కల్తీ నూనె..

ఇప్పుడు ప్రపంచమంతా కల్తీతో నిండిపోయింది. మనం బాగుంటే చాలు మిగితా వారు ఏమైనా పర్లేదు..అనే ఆలోచన సమాజాన్ని క్రుం+

దీస్తుంది. 

తాజాగా జంతువుల కళేబరాలతో వంట నూనె తయారు చేస్తున్న ముఠాను రంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొత్తూరు మండలం తమ్మాపూర్ పంచాయతీ పరిధినిలో రైల్వే స్టేషన్ దగ్గర కొంత మంది వ్యాపారులు కలిసి హరి ఫీడ్స్ ప్రయివేటు లిమిటెడ్ (కెడియా) పరిశ్రమను గొప్పగా స్టార్ట్ చేశారు. పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లు వీరు అక్కడ స్టార్ట్ చేసింది కల్తీ నూనె వ్యాపారం. చనిపోయిన పందులు, ఇతర జంతువుల కళేబరాలతో నూనె తయారు చేసి అమ్మి వ్యాపారం చేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా నడుస్తున్న వీరి కల్తీ వ్యాపారం గుట్టు రట్టయింది.

సమాచారం అందడంతో..పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో పరిశ్రమలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని పరిశ్రమను మూసేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదొక్కటే కాదు..శివారు ప్రాంతాల్లో చాలా మంది ఇదే తరహా దందాలకు పాల్పడుతున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది..మనం తినే ఆహారం ఎంత కల్తీనో..

Leave a Comment