నగ్న ఫొటోలు తీసి తల్లీకూతుళ్లపై లైంగిక దాడి.. నిందితుడికి జీవితఖైదు..!

నగ్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఓ వ్యక్తి ముగ్గిరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ అదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి ఆరో జడ్జి జయప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. అంతే కాదు రూ.2.60 లక్షల జరిమానా కూడా విధించారు. 

బెల్లంపల్లిలో ఓ ఇంట్లో పనిచేసే మహిళతో అన్వర్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఆమెను కలవడానికి రోజు వెళ్లేవాడు. ఈక్రమంలో ఆ ఇంటి యజమానురాలు బట్టలు మార్చుకుంటున్న సమయంలో రహస్యంగా ఫొటోలు తీశారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. 

అయితే ఇందుకు ఆ మహిళ ప్రతిఘటించింది. ఆమె కొడుకును చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను తల్లి నగ్నఫొటోలు చూపించాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భయపెట్టి బాలికపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

అలాగే పని మనిషిపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై 2017లో బెల్లంపల్లి వన్ టౌన్ లో కేసు నమోదైంది. విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీరామ్ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నేరం రుజువైంది. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.  

  

 

Leave a Comment