టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా పార్టీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్ స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు.
ఇక తెలగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేస్ నియమితులయ్యారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం కూడా చేశారు.