పిల్లలు పుట్టలేదన్న అసూయతోనే.. చిన్నారిని చంపిన మేనత్త..!

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్ గ్రామంలో ఇంట్లోని ట్యాంకులో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని చంపింది మేనత్త, మేనమామే అని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వారిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. 

వివరాల మేరకు అనాజ్ పూర్ కు చెందిన లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన దూసరి తిరుమలేశ్ తో 12 ఏళ్ల కింద వివాహం జరిగింది. అప్పటి నుంచి వారికి పిల్లలు లేరు. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించాడు. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. బాబు పేరును ఉమామహేశ్వర్ అని పెట్టారు. 

బాలుడు పుట్టినప్పటి నుంచి లత అనాజ్ పూర్ లోని పుట్టింట్లో తమ్ముడు బాల్ రాజ్, మరదలు శ్వేతతో కలిసి ఉంటోంది. గురువారం అర్ధరాత్రి బాబుకు పాలు ఇచ్చి నిద్రకు ఉపక్రమించింది లత. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లత నిద్రలేచి చూసే సరికి కొడుకు కనిపించలేదు. చివరికి ఇంటిపైన వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు.  

కాగా, లత తమ్ముడు బాల్ రాజుకు మరదలు శ్వేతకు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లయి రెండేళ్లయినా వారికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఇక తన ఆడపడుచుకు సంతానం కలగడంతో శ్వేత అసూయ పెంచుకుంది. ఆ అక్కసుతో రెండేళ్ల బాబును కడతేర్చింది. 

Leave a Comment