ఐపీఎల్ లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 54 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏబీ డివిలియర్స్ 11 పరుగులు చేసి ముంబై బౌలర్ బుమ్రా బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈక్రమంలో మ్యాచ్ చేసేందుకు వచ్చిన అతడి కొడుకు డివిలియర్స్ ఔట్ కావడం నిరాశ కలిగించింది. తండ్రి ఔట కావడం చూసి డివిలియర్స్ కుమారుడు అసహనానికి గురయ్యాడు. తన ముందు వరుసలో ఉన్న కుర్చీపై చేతితో బలంగా గుద్దాడు. వెంటనే నొప్పితో చేయి పట్టుకున్నాడు. కొడుకు రియాక్షన్ చూసి పక్కన ఉన్న తల్లి కూడా షాక్ కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Me after watching bhaubali
#RCBvsMI pic.twitter.com/Oe0QJb6XgS— ANMOL KAUR (@anmol_banga) September 26, 2021