సినిమాని మించిన ‘లవ్ స్టోరీ’ ఈ జంటది..!

సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం.. తర్వాత ఎన్నో ట్విస్టుల మధ్య వారి ప్రేమక కథ సుఖాంతం కావడం.. ఇది సినిమా లవ్ స్టోరీ.. తమిళనాడుకు చెందిన ఈ జంట లవ్ స్టోరీ కూడా అచ్చం సినిమాను తలిపిస్తోంది.. ఈరోడ్ కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు, ఇళమరి(23) అనే యువతి ఇద్దరు కోలిగ్స్.. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. 

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. వీరి కులాలు వేర్వేరు. దీంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఓ చోట కాపురం పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. అలా కొన్ని నెలల గడిచిపోయాయి. అయితే వీరు ఎక్కడున్నారో తెలుసుకుని యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి.. యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో సెల్వన్ తన భార్యను తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కానీ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకోలేదు. ఎందుకంటే ఇళమతి కుటుంబానికి, అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇటీవల తన భార్య నుంచి సెల్వన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తనను చంపాలని చూస్తున్నారని, కాపాడాలని మెసేజ్ చేసింది. దీంతో సెల్వన్ మీడియాను ఆశ్రయించాడు. ఇష్యూ పెద్దది కావడంతో తన భార్యకు ప్రాణహాని ఉందని సెల్వన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.       

 

Leave a Comment