ఒకే విమానంలో ఎక్కిన 640 మంది ఆఫ్ఘన్ లు.. ఫొటో వైరల్..!

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడి ప్రజలు ప్రాణ భయంతో కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీశారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడ కనిపించిన ప్రతి విమానంలోకి ఎక్కారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కాస్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. 

బస్సుల్లో సీట్ల కోసం అన్నట్లుగా అఫ్ఘన్ లు విమానాల్లో చోటు కోసం రన్ వేపై పురుగులు తీశారు. విమానం లోపలికి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈనేపథ్యంలో యూఎస్ కు చెందిన ఓ విమానంలో ఏకంగా 640 మంది ప్రజలు ఎక్కేశారు.

 అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి-17 కార్గో విమానంలో కిక్కిరిసి కూర్చున్న జనం ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విమానం రైల్లో జనరల్ బోగీని తలపించింది. అలా విమానంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి.. విమానం ఎక్కిన వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో తమ ప్రాణాలు మాత్రం చాలని అన్ని వదులుకును ఇతర దేశాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది.  

 

 

Leave a Comment