షాకింగ్: చితిపై ఉంచిన శవం.. గంగాజలం పోయగానే కళ్లు తెరిచింది..!

ఢిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కొద్ది క్షణాల్లో అంత్యక్రియలు జరుగుతాయనగా.. చితిపై ఉంచిన శవం కళ్లు తెరిచింది. వృద్ధుడు చనిపోయాడని డాక్టర్లు తప్పుగా ధ్రువీకరించడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది.. 

వివరాల మేరకు సతీష్ భరద్వాజ్(62) గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా అతడి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి చికిత్స తీసుకుంటున్న సమయంలో సతీష్ భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరికొందరు డాక్టర్లకు చూపించారు. అయితే వృద్ధుడు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఏకంగా 11 మంది డాక్టర్లు ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. 

దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చేయాల్సిన తతంగం అంతా చేస్తున్నారు. చితికి నిప్పంటించే ముందు ఆ వ్యక్తి నోట్లో గంగాజనం పోశారు. అది జరిగిన కొద్ది క్షణాల్లోనే చితిపై పడుకోబెట్టిన మృతదేహం కళ్లు తెరిచింది. అక్కడున్న కుటుంబ సభ్యుల వైపు చూసి సైగలు కూడా చేశాడు. ఈ ఘటనతో షాక్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.  

 

Leave a Comment