వైరల్ : భార్య లేకపోయినా.. ఆమె మైనపు బొమ్మతో గృహప్రవేశం..!

ఇంట్లో గృహప్రవేశ శుభకార్యం ఉంది. తన భార్యతో కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకున్నాడు కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీనివాస గుప్త. కానీ ప్రస్తుతం ఆయన భార్య లేరు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. గుప్తాకు భార్య అంటే ఎంతో ఇష్టం. తను లేకుండా ఇంట్లో ఎలా ప్రవేశించాలో అని సతమతమయ్యాడు. తన భార్య మైనపు విగ్రహం తయారు చేయించాడు. ఆ విగ్రహంతో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు.

ఇంట్లో ప్రవేశద్వారం వద్ద తెల్లటి పోఫా మీద నవ్వుతూ, గులాబీ పట్టు చీర ధరించి కూర్చొని ఉంది. అది చూసిన బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కాస్త భయపడ్డారు. చివరికి అది మైనపు విగ్రహం అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు. గుప్తా సర్ ప్రైజ్ కు అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గుప్తా భార్యను స్మరించుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. తన భార్య ఎల్లప్పుడు తన డ్రీమ్ హోంలో ఉంటుందని, ఇది ఆమె కలల ఇల్లు అని గుప్తా చెప్పారు. 

    

Leave a Comment