ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారానికే వద్దంటున్నాడు.. నవ వధువు ఆత్మహత్యాయత్నం..!

ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతాకాలనుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లయిన వారానికే నువ్వు నాకొద్దు వదిలేస్తా అని చెప్పాడు.. మనస్తాపంతో ఆ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందులో చోటుచేసుకుంది. 

కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన మద్దెబోయిన సత్యవతి 22 ఏళ్ల కుమార్తె శృతితో కలిసి ఇల్లందు పాత బస్టాండ్ ఏరియాలో ఉంట కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. శృతి కూడా పట్టణంలోని ఓ స్వీట్ షాపులో పనిచేస్తోంది. ఈక్రమంలో స్టేషన్ బస్తీకి చెందిన 23 ఏళ్ల మేకల దినేష్ తో శృతికి పరిచయం ఏర్పడింది. 

అతడు శృతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. వారం రోజుల క్రితం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో శృతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి కొత్తగూడెంలోని రుద్రంపూర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ విషయం దినేస్ కుటుంబ సభ్యులకు తెలిసింది. 

దినేష్ కుటుంబ సభ్యులు కొత్తగూడెంకు వెళ్లి ఇద్దరినీ పట్టుకున్నారు. శృతిపై దాడి చేసి తల్లి సత్యవతి వద్దకు పంపించారు. దినేష్ ను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో శృతి రెండు రోజుల క్రితం ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసు దినేష్ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో దినేష్ కూడా శృతిని వదిలేస్తానని చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన శృతి మరుగుదొడ్లను శుభ్రం చేసే హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన శృతి తల్లి ఆమెను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. వైద్యుల సూచన మేరకు ఖమ్మం తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment