పాలు ఇవ్వడం లేదని..ఆవులపై పోలీసులకు ఫిర్యాదు..!

ఇటీవల చిన్న చిన్న కారణాలకే పోలీసుల వద్ద పంచాయితీ పెట్టడం సాధారణం అయిపోయింది. చిన్న పిల్లలు కూడా పెన్సిల్ పోయిందని, ఫ్రెండ్ కొట్టాడని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం చూశాం.. అయితే ఇవి సోషల్ మీడియాలో వైరల్ నవ్వులు తెప్పిస్తున్నాయి. 

అదేవిధంగా ఓ రైతు ఆవులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆవులు పాలు ఇవ్వడం లేదని, పాలు ఇచ్చేలా చేయాలని, లేదంటే వాటిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాల్లోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరులో జరిగింది. 

ఆవులకు తగినంత దాణా, గడ్డి పెట్టి పోషిస్తున్నా.. నాలుగు రోజుల నుంచి అవి పాలు ఇవ్వడం లేదని, పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షాక్ అయిన పోలీసులు ఇటువంటి కేసులను నమోదు చేయడం కుదరదని, ఆవులను మంచిగా చూసుకో.. పాలు ఇస్తాయని చెప్పి పంపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment