శ్రీవారి భక్తురాలిని 6 కి.మీ. వీపుపై మోసుకెళ్లిన కానిస్టేబుల్..!

ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఓ భక్తురాలని ఆరు కిలోమీటర్లు వీపు మోసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన రాజంపేటలో జరిగింది. నందలూరు మండలానికి చెందిన 58 ఏళ్ల మంగి నాగేశ్వరమ్మ కాలిబాటలో శ్రీవారి దర్శనానికి పయనమైంది.

ఆ కాలిబాట కొండ మార్గం కావడంతో నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక పోయింది. హైబీపీతో గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె వద్ద కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు ఆమెను మోసుకెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ షేక్ అర్షద్ కు సమాచారం ఇచ్చారు. అర్షద్ ఆమెను వీపుపై ఎక్కించుకుని ఆరు కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం వరకు మోసుకెళ్లాడు. అక్కడ ప్రత్యేక వాహనంలో తిరుమలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. 

Leave a Comment