జనసేన అధినేత, వపర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్ నేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్, అన్నా దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తరచుగా తన తోటలోని మామిడి పండ్లను కానుకగా పంపిస్తుంటారు. ఈసారి మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక పంపడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇద్దరు హీరోల అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఇద్దరు టాప్ హీరోల మధ్య నెలకొన్ని అ అనుబంధాన్ని చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.