‘నన్ను నేనే పెళ్లి చేసుకుంటా’.. యువతికి షాక్.. అడ్డుకుంటామంటూ బీజేపీ ప్రకటన..!

ఎంచక్కా తనను తాను పెళ్లి చేసుకుని.. హనీమూన్ కి కూడా ప్లాన్ చేసింది గుజరాత్ లోని వడోదల యువతి.. ‘సోలోగమీ’ పేరుతో పిలిచే ఈ పెళ్లితో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అయితే ఈ యువతికి వివాహం జరగకముందే షాక్ తగిలింది.. ఆమె వివాహాన్ని అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించింది. 

వడోదరకు చెందిన క్షమ బిందు అనే 24 ఏళ్ల యువతి స్వీయ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించుకుంది. సంప్రదాయపద్ధతిలో, బంధువులు, అతిథుల సమక్షమంలో ఈ పెళ్లి తంతు జరుగుతున్నట్లు చెప్పింది. ఒక్క వరుడు తప్ప ఈ పెళ్లిలో అన్ని ఉంటాయి. అంతేకాదు పెళ్లి తర్వాత రెండు వారాల పాటు గోవాకు హనీమూన్ ప్లాన్ కూడా వేసుకుంది.. 

ఈ వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఆమె పెళ్లిని వడోదర మాజీ డిప్యూటీ మేయర్ సునీతా శుక్లా ఖండించారు. బిందు పెళ్లిని అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. ఈ పెళ్లిని తాము వ్యతిరేకిస్తున్నామని, ఏ గుడిలోనూ పెళ్లి చేసుకోవడానికి ఆమెను అనుమతించమని స్పష్టం చేశారు. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధమని అన్నారు. 

 

Leave a Comment