ఏపీలో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 

2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం పదో తరగతి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను జూన్ 6కు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.  

 

Leave a Comment