2022లో భూమి ఏలియన్స్ దాడి చేస్తాయట.. వాంగ బాబా జ్యోతిష్యం ఏంచెబుతోంది?  

మనం బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని ఎంతగానో నమ్ముతాం.. ఆయన చెప్పినవన్నీ నిజం అవుతాయని మనకి నమ్మకం.. అదేవిధంగా బల్గేరియాలో వంగ బాబాను ప్రజలు నమ్ముతారు. ఆమె 1996లో చనిపోయింది. ఆమె బతికుండగా భవిష్యత్ గురించి చెప్పింది. ఈమె చెప్పినవన్నీ నిజమవుతాయని ప్రజల నమ్మకం.. అయితే ఆమె చెప్పిన అంచనాలన్నీ దాదాపు నిజమయ్యాయి. 9/11 ఉగ్రదాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి వాటిని ముందే ఊహించింది. 

అంతేకాదు రాబోయే 2022 సంవత్సరానికి సంబంధించి ఆమె అనేక అంచనాలు కూడా వేసింది. కరోనా మహమ్మారితో ప్రపంపం ఇప్పటికే పోరాడుతోంది. అయితే 2022లో సైబీరియాలో కొత్త వైరస్ వస్తుందని బాబా వంగ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా నగరాల్లో తాగునీటి కొరత ఏర్పడుతుంది. అలాగే నదుల్లో కాలుష్యం కూడా పెరుగుతుంది. 

బాబా వంగ 2004 సునామీని అంచనా వేసింది. అలాగే 2022 నాటికి అనేక ఆసియా మరియు ఆస్ట్రేలియన్ దేశాలు భారీ వరదల బారిన పడతాయని, వందలాది మంది ప్రాణాలు కోల్పోతారని ఆమె అంచనా వేసింది. ఇక భారతదేశం విషయానికొస్తే.. దేశం 2022లో మిడతల దాడులకు గురవుతుంది. ఇది పంటలు మరియు వ్యవసాయ భూమిని నాశనం చేస్తుంది. ఇది మరింత కరువుకు దారితీస్తుంది. 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుంది అని ఆమె అంచనా వేసింది.

2022లో ఏలియన్స్ భూమిపై దాడి చేస్తాయని ఆమె అంచనా వేసింది. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపై జీవం కోసం వస్తుంది. అందులోని గ్రహాంతర వాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి, మానవులను ఖైదీలుగా పట్టుకోవచ్చు.. అని వంగా బాబా తన జ్యోతిష్యంలో పేర్కొంది. అయితే వాంగ బాబా చెప్పిన విషయాలు రాతపూర్వకంగా లేవు. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు కల్పించి చెప్పారనే చర్చ కూడా జరుగుతోంది. 

 

Leave a Comment