ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 524 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1093 మంది ఉన్నారు.
గడచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 25 కేసులు నమోదుకాగా, గుంటూరులో 19, కృష్ణాలో 12, విశాఖలో 6, కడపలో 4, చిత్తూరులో 1 కేసులు వచ్చాయి. మొత్తంగా కర్నూలులో 491 కేసులు, గుంటూరులో 338, కృష్ణాలో 278 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,292 శాంపిల్స్ పరిక్షించగా 67 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..
జిల్లా | కరోనా కేసుల సంఖ్య |
కర్నూలు | 491 |
గుంటూరు | 338 |
కృష్ణా | 278 |
నెల్లూరు | 91 |
కడప | 87 |
చిత్తూరు | 82 |
అనంతపురం | 78 |
ప్రకాశం | 61 |
తూర్పుగోదావరి | 59 |
పశ్చిమ గోదావరి | 45 |
విశాఖపట్నం | 35 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 0 |
మొత్తం | 1650 |