గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 60 కోరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1777 కు చేరింది. ఇప్పటి వరకు 36 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1012 మంది ఉన్నారు.
గత 24 గంటల్లో కర్నూలులో 17, గుంటూరు 12, కృష్ణా 14 కేసులు నమోదు కాగా, 13 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచి నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1, కడపలో 1, విశాఖలో 2 కేసులు వచ్చాయి. ఇక కరోనా నుంచి కోలుకుని 729 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 7,782 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
జిల్లా పేరు | కరోనా కేసుల సంఖ్య |
కర్నూలు | 533 |
గుంటూరు | 363 |
కృష్ణా | 300 |
నెల్లూరు | 92 |
చిత్తూరు | 82 |
అనంతపురం | 80 |
కడప | 90 |
ప్రకాశం | 61 |
పశ్చిమ గోదావరి | 59 |
తూర్పుగోదావరి | 46 |
విశాఖపట్నం | 39 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 0 |
ఇతరులు | 27 |
మొత్తం | 1777 |