ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరింది. గడచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ ను పరీక్షించగా 58 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. 

ఇప్పటి వరకు కరోనాి వైరస్ ప్రభావం కారణంగా 33 మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1062 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 488 మంది డిశ్చర్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 30 కేసులు వచ్చాయి. దీంతో కర్నూలులో మొత్తంగా కేసుల సంఖ్య 466కు చేరింది. 

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..

 

జిల్లా పేరుకేసుల సంఖ్య
కర్నూలు466
గుంటూరు319
కృష్ణా266
నెల్లూరు91
కడప83
చిత్తూరు81
అనంతపురం78
ప్రకాశం61
పశ్చిమ గోదావరి59
తూర్పు గోదావరి45
విశాఖపట్నం29
శ్రీకాకుళం5
విజయనగరం0
మొత్తం1583

 

Leave a Comment