ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరింది. గడచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ ను పరీక్షించగా 58 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
ఇప్పటి వరకు కరోనాి వైరస్ ప్రభావం కారణంగా 33 మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1062 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 488 మంది డిశ్చర్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 30 కేసులు వచ్చాయి. దీంతో కర్నూలులో మొత్తంగా కేసుల సంఖ్య 466కు చేరింది.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..
జిల్లా పేరు | కేసుల సంఖ్య |
కర్నూలు | 466 |
గుంటూరు | 319 |
కృష్ణా | 266 |
నెల్లూరు | 91 |
కడప | 83 |
చిత్తూరు | 81 |
అనంతపురం | 78 |
ప్రకాశం | 61 |
పశ్చిమ గోదావరి | 59 |
తూర్పు గోదావరి | 45 |
విశాఖపట్నం | 29 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 0 |
మొత్తం | 1583 |