ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్గా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 1833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 38 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 780 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1015 మంది చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 16 కేసులు, గుంటూరులో 10, కర్నూలులో 7, విశాఖ 7, కడప 6, నెల్లూరు 4, అనంతపురం 3, విజయనగరం 3 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 540 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. గత 24 గంటల్లో 8,087 శాంపిల్స్ పరీక్షించగా 56 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు

 

జిల్లాకేసుల సంఖ్య
కర్నూలు540
గుంటూరు373
కృష్ణా316
కడప96
నెల్లూరు96
అనంతపురం83
చిత్తూరు82
పశ్చిమ గోదావరి59
ప్రకాశం61
తూర్పు గోదావరి46
విశాఖపట్నం46
శ్రీకాకుళం5
విజయనగరం3
ఇతరులు27
మొత్తం1833

 

Leave a Comment